McLaren | సుదీర్ఘకాలంగా భారత్ మార్కెట్లోకి ఎంటరయ్యేందుకు ఎదురుచూస్తున్న బ్రిటన్ సూపర్ కార్ల తయారీ సంస్థ మైక్ లారెన్స్ ఎట్టకేలకు సరికొత్త సూపర్ కారు 765ఎల్టీ స్పైడర్ మోడల్ను ఆవిష్కరించింది. ఫెరారీ తర్వాత ప్రపంచంలోనే ఎఫ్1- ఫార్ములా వన్ రేసింగ్ కార్ల తయారీలో నిలిచిన కార్ల సంస్థ మైక్లారెన్స్. తమ బ్రాండ్ కార్లకు ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలో భారత్ను కీలక మార్కెట్గా మైక్ లారెన్స్ రేసింగ్ సంస్థ భావిస్తున్నది. జీటీ, అర్టురా, 765ఎల్టీ స్పైడర్ వరకు అన్ని మోడల్ కార్లను భారత్ మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. ఇక 765 ఎల్టీ స్పైడర్ కారును 765ఎల్టీ, 720ఎస్ వేరియంట్లలో తీసుకొస్తున్నది.
765 ఎల్టీ స్పైడర్ శరవేగంగా కన్వర్టబుల్ కారుగా నిలువనున్నది. 4.0 లీటర్ల ట్విన్-టర్బో చార్జ్డ్ వీ8 ఇంజిన్తో వస్తున్నది. ఇది 765హెచ్పీ పవర్, 800 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది. కేవలం 11 సెకన్లలో ఈ కారు రూఫ్ తెరుచుకోవడం, మూసుకోవడం జరిగిపోతుంది. మైక్ లారెన్స్ ప్రవేశ పెట్టిన అతికొద్ది మోడల్ కార్లలో 720 ఎస్ స్పైడర్ ఒకటి. ఈ కారు ధర రూ. 5.04 కోట్లుగా నిర్ణయించారు.
720 ఎస్ స్పైడర్ సైతం 4.0 లీటర్ల ట్విన్-టర్బో చార్జ్డ్ వీ8 ఇంజిన్తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. 720 హెచ్పీ పవర్, 770 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్తో దూసుకెళ్లగల కెపాసిటీ దీని సొంతం. రూఫ్తో గరిష్టంగా గంటకు 341కి.మీ. రూఫ్ లేకుండా 325 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.
ముంబైలో తొలి షోరూమ్ను గురువారం ప్రారంభించింది. ఇనిఫిటీ కార్లను దిగుమతి ద్వారా భారత్ మార్కెట్లో ప్రవేశ పెట్టింది. సుశిక్షితులైన ఇంజినీర్లతో కూడిన తొలి సర్వీస్ సెంటర్ కూడా ముంబైలో ప్రారంభించింది. వరల్డ్ స్పోర్ట్స్ కార్ల సంస్థగా మైక్ లారెన్స్ రేసింగ్స్ ప్రసిద్ధి చెందింది. 2016 నుంచి భారత్ మార్కెట్లోకి ఎంటరవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇనిఫినిటీ కార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లలిత్ చౌదరి తెలిపారు. భారత్లోకి ఎంటరైనందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మైక్ లారెన్స్ ఆసియా పసిఫిక్ అండ్ చైనా ఎండీ పాల్ హరిస్ కూడా పాల్గొన్నారు.