హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 ( నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా తెలంగాణ ప్రభు త్వం.. ‘కనెక్టెడ్, అటానమస్, షేర్డ్, ఎలక్ట్రిక్(సీఏఎస్ఈ) మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ ఛాలెంజ్’ను నిర్వహిస్తున్నది. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా దేశీయ స్టార్టప్లను ఆహ్వానిస్తున్నట్టు ఐటీ ముఖ్య కారదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి విజేతకు రూ.10 లక్షలు, రెండో విజేతకు రూ.5 లక్షల గ్రాంట్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా వివరించారు. కాగా, ఛాలెంజ్లో పాల్గొనే స్టార్టప్లు భారతీయ ఈ-మొబిలిటీ రంగంలోని కీలక సమస్యలను పరిష్కరించే విధంగా తమ వినూత్న ఆలోచనలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 7న నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ గ్రాండ్ ఛాలెంజ్ స్టార్టప్ల ఔత్సాహిక వేత్తలకు సాంకేతిక నిపుణులతో సంభాషించే అవకాశం ఉంటుందని తెలిపారు.
విజేతల వివరాలు టీ హబ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో నమోదు చేస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వందకు పైగా స్టార్టప్లు ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించాయని వివరించారు. స్టార్టప్లు వాస్తవికత, ఆవిష్కరణ, సాధ్యత ఆధారంగా మూల్యాంకనం చేయబడతాయని చెప్పారు. అనంతరం అపోలో టైర్స్ లిమిటె డ్, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆ ఫ్రికా ప్రెసిడెంట్ సతీష్ శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ కోసం తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం గ ర్వంగా ఉందని చెప్పారు. గత ఏడాది యూ కేలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన తర్వాత..ఇప్పుడు హైదరాబాద్లో 2వ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీవీఎస్ మోటర్ కంపెనీ చీఫ్ మహేశ్వరన్ మాట్లాడుతూ.. సీఏఎస్ఈ మొబిలిటీ అనేది స్టార్టప్ కమ్యూనిటీకి ఒక వేదికను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక ముఖ్యమైన చొరవ అని చెప్పారు.