ముంబై, నవంబర్ 1: ఉద్యోగుల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టెక్ మహీంద్రాకు స్వల్ప ఊరట లభించింది. గడిచిన త్రైమాసికానికిగాను వలసల రేటు 20 శాతంగా నమోదైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 22 శాతం కంటే ఇది తక్కువ.
గత త్రైమాసికంలో సంస్థ నికరంగా 5,877 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.63 లక్షలకు చేరుకున్నారు.