T Estate Diwali Gift | మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబురాలు జరుపుకోనున్నారు. దీపావళి సందర్భంగా దాదాపు అన్ని కంపెనీలు తమ సిబ్బందికి బహుమతులు, బోనస్ ఇస్తాయి. కొన్ని కంపెనీలు తమ సిబ్బంది కుటుంబాలకు దుస్తులు, గిఫ్ట్ ఓచర్లు ఇన్సెంటివ్లు ఇస్తే.. మరికొన్ని కంపెనీలు తీపి మిఠాయిలు పంపిణీ చేస్తుంటాయి.
కానీ తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి టీ ఏస్టేట్ ఓనర్ శివకుమార్.. తన సిబ్బంది పట్ల ఉదారత చూపారు. టీ ఎస్టేట్లో పని చేసే వారందరికీ దీపావళి బోనస్ రూపంలో పేరొందిన టూ వీలర్స్ తయారీ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లు పంపిణీ చేసి మరీ అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. ఈ ఉదంతం వార్తా సంస్థల్లో పతాక శీర్షికలకెక్కింది. ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిళ్లు బోనస్గా అందుకున్న టీ ఎస్టేట్ సిబ్బంది వాటితో సంబురాలు చేసుకున్న దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. సిబ్బందికి బుల్లెట్ల `కీ` పంపిణీ పూర్తయ్యాక.. వారితోపాటు జాలీ ట్రిప్ వేశారు. కలిసిపోయి ఆడి పాడారు. తమకు ఆశ్చర్యకరమైన రీతిలో మరిచిపోలేని `దీపావళి గిఫ్ట్` ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బయిన సిబ్బంది తమ ఓనర్కు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పారు.
తమకు ఈ గిష్ట్ వస్తుందని ఊహించలేదని, సిబ్బంది పనితీరు ఆధారంగా సుమారు 15 మందికి రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు బైక్లు ఇస్తాడని భావించాం అని ఓ ఉద్యోగి పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. కానీ, తమ అందరికీ మోటారు సైకిళ్లు వచ్చాయన్నాడు. తమ టీం వర్క్ పట్ల సంతోషంతో ఓనర్ తమను దీవించారని అన్నాడు. ఇంతకుముందు హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ యజమాని తన సిబ్బందిలో 12 మందికి దీపావళి గిఫ్ట్గా టాటా పంచ్ కార్లు పంపిణీ చేశాడు