TCS after Reliance | ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో మైలురాయిని చేరుకున్నది. మంగళవారం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13.01 లక్షల కోట్లకు చేరుకున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్లో టీసీఎస్ వాటా 1.32 శాతం (రూ.45.80) పెరిగి రూ.3,517.55 వద్ద ట్రేడయింది. ఒకానొక దశలో రూ.3520 వరకు దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ ఒకశాతానికి పైగా లాభపడింది.
రిలయన్స్ తర్వాత రూ.13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల కార్పొరేట్ దిగ్గజంగా టీసీఎస్ నిలిచింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13.80 లక్షల కోట్లుగా ఉంది.
ఐటీ రంగంలో ఈ మైలురాయిని దాటిన తొలి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ నెలలో ఇప్పటి వరకు 12 రోజులు జరిగిన ట్రేడింగ్లో టీసీఎస్ స్క్రిప్ట్ 11 శాతం ర్యాలీ అయ్యింది. .