Tata Steel | పెరిగిపోయిన బొగ్గు, ఐరన్ఓర్ ధర ప్రభావం దేశీయ ఉక్కు పరిశ్రమపై పడినట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్స్ తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలే దీనికి నిదర్శనం. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ కేవలం రూ.9,835 కోట్ల లాభం గడించింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్స్ రూ.9,598 కోట్ల లాభాలు నమోదు చేసింది. దీని ప్రకారం గత నెలతో ముగిసిన త్రైమాసికంలో కేవలం రూ.237 కోట్ల లాభం మాత్రమే గడించింది.
గతేడాది ఇన్వెస్టర్లు, వాటాదారులకు టాటా స్టీల్ ఈక్విటీపై రూ.51 డివిడెండ్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో `ఈబీఐటీడీఏ ( EBITDA ) రూ.15,891 కోట్లు. ఇది గతేడాది మూడో త్రైమాసికం ఈబీఐటీడీఏ రూ.15,980 కోట్లతో సమానమే. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోనే టాటా స్టీల్ అత్యధికంగా రూ.17,810 కోట్ల ఈబీఐటీడీఏ లాభం ప్రకటించింది. నాటి నుంచి ప్రతి త్రైమాసికంలోనూ ఈబీఐటీడీఏ రూ.16 వేల కోట్ల లోపే.