న్యూఢిల్లీ, జనవరి 17: ప్రీమియం ఎస్యూవీ సఫారీని డార్క్ ఎడిషన్గా మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు ప్రారంభ ధర రూ.19.05 లక్షలు. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్లు ఆరంభించినట్లు తెలిపింది. మూడు రకాల్లో లభించనున్న ఈ వాహనంలో వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి నూతన ఫీచర్స్ ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.