హైదరాబాద్, ఏప్రిల్ 22: టాటా గ్రూపునకు చెందిన విద్యుత్ పరికరాల తయారీ సంస్థ టాటా పవర్…రాష్ట్ర మార్కెట్లోకి విద్యుత్ ఆదా ఉత్పత్తులను విడుదల చేసింది. యాప్ ఆధారంగా కంట్రోల్ చేసుకునే విధంగా ఈజెడ్ హోమ్ స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పరికరాలు రూ. 250 మొదలుకొని రూ.20 వేల ధర లోపుల లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. లైటింగ్, వాతావరణానికి అనుగుణంగా లైటింగ్ను సెట్ చేసుకోవచ్చునని తద్వారా విద్యుత్ ఆదా కానున్నట్టు చెప్పారు. ఈ పరికరాలతో యేటా 15 శాతం వరకు విద్యుత్ ఆదా కానున్నదని, దీంతో ప్రతియేటా రూ.10 వేల వరకు బిల్లు తగ్గనున్నదని పేర్కొంది.