న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ కూడా విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి సారించింది. కమర్షియల్ ట్రక్కు విభాగంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సంస్థ..వచ్చే నాలుగు నుంచి ఐదేండ్ల కాలంలో ఈవీలను ఉత్పత్తి చేయడానికి బిలియన్ డాలర్లు(రూ.7500 కోట్లు) మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది.