న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసారి కొత్తగా ఈవీ పికప్ వాహనాన్ని పరిచయం చేసింది. 28.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ వాహనం సింగిల్ చార్జింగ్తో 211 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ వాహనం ప్రారంభ ధర రూ.11.95 లక్షలుగా నిర్ణయించింది.
కంపెనీ నుంచి విడుదలైన మూడో చిన్న కమర్షియల్ వాహనం ఇదే కావడం విశేషం. కేవలం 55 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్న ఈ వాహనం 1,750 కిలోల సరుకును రవాణా చేయనున్నది. ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, కోల్డ్-చెయిన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్, పాల ఉత్పత్తుల సరఫరాతోపాటు ఇతర సరుకు రవాణాకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని విడుదల చేసినట్టు టాటా మోటర్స్ వర్గాలు వెల్లడించాయి.