Ratan Tata | విమానయానానికి ఎయిరిండియాను మారుపేరుగా తీర్చిదిద్దుతామని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తెలిపారు. అందుకోసం అందరితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ఎయిరిండియా విమానాలు బయలుదేరుతున్నప్పుడు రతన్ టాటా 19 సెకన్ల వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్ను ఎయిరిండియా ట్వీట్ చేసింది. నష్టాల్లో చిక్కుకున్న ఎయిరిండియాను గత నెల 27న టాటా సన్స్ టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా కొన్ని విమానాల్లో ఈ మెసేజ్ ప్లే చేస్తున్నట్లు ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్ స్వాగతం పలుకుతున్నది. సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు మెరుగైన సేవలకు ఎయిరిండియాను మారుపేరుగా నిలుపుతామని రతన్ టాటా ఆ సందేశంలో పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రాసెస్లో టాటా సన్స్ అనుబంధ సంస్థ టాలెస్కు రూ.18వేల కోట్లకు ఎయిరిండియాను కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నగదు చెల్లించిన టాటా సన్స్, రూ.15,300 కోట్ల రుణాల చెల్లింపు బాధ్యత తీసుకున్నది.