న్యూఢిల్లీ, నవంబర్ 5: భారత్లో మొ బైల్ టారీఫ్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పరిశ్రమ పెట్టుబడులు చేయాలంటే చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా చెప్పారు. వాస్తవానికి ఐదు త్రైమాసికాలుగా వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏపీఆర్యూ) వృద్ధి చెందుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ ఏపీఆర్యూ నిరుడు ఇదేకాలంతో పోలిస్తే 19.5 శాతం వృద్ధిచెంది రూ.131కు చేరింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఇది రూ.128 ఉంది. టారీఫ్ల పెంపు, యూజర్ల అప్గ్రేడేషన్ కారణంగా ఈ వృద్ధి సాధ్యపడింది. ‘ఏడాదిగా టారీఫ్ల్ని పెంచినా, ఇండియాలో ఇప్పటికీ చాలా తక్కువస్థాయిలోనే ఉన్నాయి. టెలికాం రంగం భవిష్యత్తులో పెట్టుబడుల్ని కొనసాగించాలంటే, చార్జీలు మరింతగా పెరగాల్సి ఉందని మేము విశ్వసిస్తున్నాం’ అని వీఐఎల్ సీఈవో వివరించారు. కంపెనీ క్యూ 2 ఆర్థిక ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4జీ, అన్లిమిటెడ్ ప్లాన్స్లో మరింతమంది వినియోగదారుల్ని ఆకర్షించడంపై వీఐఎల్ దృష్టిపెట్టిందన్నారు.