హైదరాబాద్, జూన్ 9: తాన్లా ప్లాట్ఫామ్స్.. అమెరికాకు చెందిన ట్విలియో నుంచి వాల్యూఫస్ట్ డిజిటల్ మీడియా ప్రైవేట్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చు కుంది. వాల్యూఫస్ట్ను రూ. 346 కోట్లకు కొంటున్నట్టు కమ్యునికేషన్ ప్లాట్ఫామ్-ఏజ్-ఏ-సర్వీస్ (సీపాస్) సంస్థ అయిన తాన్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లావాదేవీ జూలై నెలలో పూర్తవుతుందని అంచనా.
భారత్లో చాలాకాలం నుంచి సీపాస్ సేవలు అందిస్తున్న వాల్యూఫస్ట్ను టేకోవర్ చేయడంతో ఈ రంగంలో తమ మార్కెట్ వాటా పటిష్టపడుతుందని తాన్లా తెలిపింది. అలాగే రూ.20 కోట్లతో వాల్యూఫస్ట్ మిడిల్ఈస్ట్ ఎఫ్జడ్సీని సైతం కొనుగోలు చేస్తున్నామని, ఈ సంస్థ యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా మార్కెట్లలో ఉనికి ఉందని, ఈ టేకోవర్ సెప్టెంబర్కల్లా పూర్తవుతుందని తాన్లా ప్లాట్ఫామ్స్ వివరించింది.