న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : ట్రాక్టర్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ టఫే ట్రాక్టర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2,14,961 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.
కిందటేడాది 1,74,785 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కంపెనీ చరిత్రలో ఒక నెలలో ఇంతటి స్థాయిలో పుంజుకోవడం విశేషమని కంపెనీ వైస్ చైర్మన్ లక్ష్మి వేణు తెలిపారు. జీఎస్టీని తగ్గించడంతో వ్యవసాయ రంగం రాణించడం కలిసొచ్చింది.