హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంపెనీలకు సేవలను అందించేందుకు టీహబ్ ప్రముఖ ఆటోనమీ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సమక్షంలో టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, ఆటోనమీ కంపెనీల ప్రతినిధుల బృందం ఒప్పందం చేసుకొని పరస్పరం పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్బంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. టెక్నాలజీ పరంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా ఇంటర్నెట్ వీక్షణంలో కొత్త తరం టెక్నాలజీగా వెబ్ 3 అందుబాటులోకి వస్తున్నది, ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఇంటర్నెట్ ప్రపంచమే సరికొత్తగా మారిపోతుందన్నారు.
టీ హబ్కు హోనీవెల్ ప్రతినిధులు
అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ హానీవెల్ ప్రతినిధుల బృందం టీ హబ్ను సందర్శించింది. ఈ సందర్బంగా టీ హబ్ ప్రతినిధితో కలిసి స్టార్టప్ ఏకో సిస్టం, పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై ప్రధానంగా వీరు చర్చించారు. రెండు సంస్థలు కలిసి స్టార్టప్లను ప్రోత్సహించేలా కొత్త వేదికను ఏర్పాటు చేసే అవకాశంపై ప్రధానంగా వీరు చర్చించినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుండగా, స్టార్టప్ల పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం బాగుందని హోనీవెల్ ప్రతినిధులు పేర్కొన్నారు.