హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీతో లాజిస్టిక్స్ రంగంలోనూ అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని, ఆవిష్కరణలు చేసేందుకు వీలుందని టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు అన్నారు. వస్తూత్పత్తుల డెలివరీ కోసం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించేలా పీక్యూ కంపెనీ వ్యాపార ప్రణాళిక ఎంతో బాగుందని ప్రశంసించారు. మంగళవారం టీ-హబ్ వేదికగా డెలివరీ బాయిస్ కోసం సమకూర్చిన ఎలక్ట్రిక్ టూవీలర్లను ఆ కంపెనీ సీఈవో ప్రశాంత్రెడ్డితో కలిసి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈవీలకు రాష్ట్రంలో ప్రోత్సాహక వాతావరణం ఉందన్నారు.