హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకున్న స్టార్టప్స్ ఆంత్రప్రెన్యూర్లకు వీ హబ్ సీఈవో దీప్తి రావుల అభినందనలు తెలిపారు. పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యత్తమ స్టార్టప్లలో వీ హబ్కు చెందిన 5 స్టార్టప్స్ ఉన్నాయి.
వీటిలో కోమల్ బల్ద్వా(వలేరియా ఎసెన్షియల్), లత నడుకుడ(శ్రీ లతా గార్మెంట్స్), అకిత కొల్లూరు(హీమాక్ హెల్త్కేర్), మిథుల దేవభక్తుని(ఎంఐవీఐ ప్రైవేట్ లిమిటెడ్), నెమరుగొమ్ముల శిల్ప(సిల్క్ ఇండియా)లు ఈ నెల 6న టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ అవార్డులతో వీ హబ్ విశిష్ఠత మరింతగా పెరిగిందని దీప్లి రావుల పేర్కొన్నారు.