Swiggy | ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లు, వారి డిపెండెంట్లకు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీస్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తక ముందు డెలివరీ ఎగ్జిక్యూటివ్లు టోల్-ఫ్రీ నంబర్ లేదా పార్టనర్ యాప్ వీడకుండా ఎస్వోఎస్ బటన్ను టాప్ చేస్తే చాలు.. ఫుడ్ డెలివరీ తర్వాత ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ అందుకోవచ్చునని తెలిపింది.
నీతి ఆయోగ్ అంచనా ప్రకారం 2020-21లో ఇండియా గిగ్ ఎకానమీలో 77 లక్షల మంది ఉన్నారని తెలిసింది. 2029-30 నాటికి వీరి సంఖ్య 2.35 కోట్ల మందికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. డెలివరీ బాయ్స్, క్లీనర్లు, కన్సల్టెంట్స్, బ్లాగర్లు గిగ్ ఎకానమీలో భాగస్వాములుగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సామాజిక భద్రత, గ్రాట్యూటీ, కనీస వేతన పరిరక్షణ, పని గంటల విషయమై సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కుటుంబ జీవనం యధాతథంగా కొనసాగించడం కోసం సంప్రదాయ ఉద్యోగి-యాజమాన్య ఒప్పందాలకు బయట పని చేస్తున్నారు.
తొలుత బెంగళూరులో ప్రయోగాత్మక తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్లకు స్విగ్గీ.. అంబులెన్స్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తర్వాత ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), హైదరాబాద్, ముంబై, పుణె, కోల్కతా నగరాల్లో ఈ సర్వీస్ తెచ్చింది. సగటున 12 నిమిషాల్లో తమ ఎగ్జిక్యూటివ్లకు అంబులెన్స్ ఫెసిలిటీ లభిస్తుందని స్విగ్గీ వెల్లడించింది. వేర్వేరు అంబులెన్స్ సంస్థల అంబులెన్స్ వ్యాన్లను డిస్పాచ్ చేసేందుకు స్విగ్గీ.. `డయల్4242`తో టై-అప్ చేసుకున్నది.
` స్విగ్గీ అందించిన ఇన్సూరెన్స్ కవరేజీతో మా యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ, వారి డిపోనెంట్స్ (జీవిత భాగస్వాములు, ఇద్దరు పిల్లలు)కు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. డెలివరీ ఎగ్జిక్యూటివ్లు కూడా తమ కుటుంబ సభ్యులకు అంబులెన్స్ ఫెసిలిటీ పొందొచ్చు. ఖర్చులో సబ్సిడీ కల్పిస్తాం` అని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.