న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ కంపెనీ స్విగ్గీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లక్ష్మీ నందన్ రెడ్డి ఓబుల్ ఆ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. ఈ మేరకు శుక్రవారం స్విగ్గీ తెలియజేసింది. ఓబుల్.. హోల్-టైమ్ డైరెక్టర్, ఇన్నోవేషన్ హెడ్గా తప్పుకున్నారని, శుక్రవారం నుంచే అది అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొన్నది.
వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో స్విగ్గీ వివరించింది. ఇక స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫణికిషన్ అద్దెపల్లి, స్విగ్గీ గ్రూప్ సీఎఫ్వో రాహుల్ బత్రాలు అదనపు డైరెక్టర్లుగా జూన్ 1 నుంచి వ్యవహరించనున్నారు.