Infosys | ముంబై, మార్చి 8: తాజాగా రాజ్యసభకు నామినేట్ అయిన సుధా మూర్తికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో రూ.5,600 కోట్ల విలువైన 0.83 శాతం వాటా ఉన్నది. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వివిధ అంశాలపై పలు పుస్తకాలు సైతం రాశారు. మూర్తి ట్రస్ట్కు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. బీఎస్ఈకి ఇన్ఫోసిస్ సమర్పించిన షేర్హొల్డింగ్ వివరాల ప్రకారం సుధా మూర్తికి కంపెనీలో 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి.
గురువారంనాటి ఇన్ఫోసిస్ షేరు ముగింపు ధర రూ.1,695 మేరకు వాటి విలువ రూ.5,586.66 కోట్లు. నారాయణ మూర్తికి రూ.2,691 కోట్ల విలువైన 1.66 కోట్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. మూర్తి దంపతుల కుమార్తె, బ్రిటన్ ప్రధాని రిషిసునక్ సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్లో 1.07 శాతం వాటా (3.9 కోట్ల షేర్లు), కుమారుడు రోహన్ మూర్తికి 1.67 శాతం వాటా (6.08 కోట్ల షేర్లు) ఉన్నది.