న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: హైదరాబాద్కు చెందిన శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్.. స్టీల్ పైపుల తయారీ సంస్థ జిందాల్ సాలో విలీనమైంది. దివాలా ప్రక్రియలో భాగంగా ఇది జరిగింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు జిందాల్ సా తాజాగా తెలియజేసింది. రుణపీడిత శాతవాహన ఇస్పాత్ కంపెనీ కోసం జిందాల్ సా ఓ రిజల్యూషన్ ప్లాన్ను గతంలోనే సమర్పించిన విషయం తెలిసిందే. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్-1 ఈ నెలారంభంలో ఆమోదం కూడా తెలిపింది.
ఈ నేపథ్యంలోనే జిందాల్ సా ఇప్పుడు విలీన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాగా, శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్ 1989లో ఏర్పాటైంది. గనుల రంగానికి చెందిన ఈ కంపెనీలో 500 మంది వరకు ఉద్యోగులున్నారు. ఈ కంపెనీని పృథ్వీరాజ్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ సా రూ. 530 కోట్ల బిడ్తో దక్కించుకున్నది. బిడ్డింగ్లో వేదాంత, వెల్స్పన్ తదితర కంపెనీలూ పోటీపడ్డాయి. అయినప్పటికీ జిందాల్ సా గెలుచుకున్నది. ఇదిలావుంటే 50 మెగావాట్ల క్యాపిటీవ్ పవర్ ప్లాంట్తోపాటు ఏపీ, కర్నాటకల్లో పిగ్ ఐరన్, డైక్టెల్ ఐరన్ పైప్ ఉత్పాదక ప్లాంట్లూ శాతవాహన ఇస్పాత్కున్నాయి.