హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశవ్యాప్తంగా ఉన్న చిన్న స్థాయి పరిశ్రమలకు ఓఎన్డీసీ ప్లాట్ఫాం గేమ్ఛేంజర్గా నిలువనున్నదని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐ భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిన్న స్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఈ నూతన ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఓఎన్డీసీ..డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నదన్నారు. ఈ-రిటైల్ వినిమయంలో భారత్ చాలా వెనుకబడివున్నదని ఓఎన్డీసీ బిజినెస్ అధికారి శిరీష్ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా 1.2 కోట్ల కిరాణా దుఖాణాలు ఉండగా..వీటిలో 15 వేలు మాత్రమే ఈ-కామర్స్తో అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు.