న్యూఢిల్లీ, జూన్ 14: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ ఐ) చైర్మన్ దినేశ్ ఖారా..గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.37 లక్షల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. వీటిలో రూ.27 లక్షలు బేసిక్ వేతనం కాగా, రూ.9.9 లక్షలు అలవెన్స్ల రూపంలో పొందారు. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.34.42 లక్షల కంటే 7.5 శాతం అధికమని తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2020-21లో అప్పటి చైర్మన్ రజనీశ్ కుమార్కు పొందిన జీతం కంటే 13.4 శాతం అధికం. 1984లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా తన కేరియర్ను ప్రారంభించిన ఖారా..అక్టోబర్ 2020లో చైర్మన్గా పదొన్నతి పొందారు. అలాగే ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి బేసిస్ వేతనం కింద రూ.26.3 లక్షలు, ఖరువు భత్యం కింద మరో రూ.9.7 లక్షలు అందుకున్నారు.