Startups | న్యూఢిల్లీ, మార్చి 18: దేశీయ స్టార్టప్లు ఈ ఏడాది కొత్తగా 8-12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశాలున్నాయని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఎక్స్వీ ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి కూడా. గతేడాది 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిన స్టార్టప్లు..ఈసారి మాత్రం లక్ష కోట్ల స్థాయిలో అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ప్రస్తుతం 20 స్టార్టప్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయని, వచ్చే ఎనిమిదేండ్లకాలంలో వీటి సంఖ్య 100కి చేరుకునే అవకాశం ఉన్నదన్నారు.