హైదరాబాద్, నవంబర్ 12: ట్రాన్స్ఫార్మర్ల తయారీ దిగ్గజం, హైదరాబాద్కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఈఎల్).. 4,000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ఉత్పత్తుల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. ఈ కాంట్రాక్టును భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ) నిర్వహించిన బిడ్డింగ్లో గెలుపొందింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్వోఏ)ను గురువారం అందుకున్నట్లు శుక్రవారం ఎస్ఎస్ఈఎల్ తెలియజేసింది. పీఎల్ఐ పథకం కింద ఏర్పాటుచేస్తున్న ఈ ప్లాంట్లలో అత్యంత ప్రభావవంతమైన సోలార్ పీవీ మాడ్యుల్స్తోపాటు సెల్, పాలీసిలికాన్, ఇంగాట్-వేఫర్ తయారీ జరుగనున్నది. కాగా, ఈ కాంట్రాక్టుతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో తామూ భాగమైనందుకు సంతోషంగా ఉందని సంస్థ సీఈవో శరత్ చంద్ర అన్నారు. అయితే ఈ ప్లాంట్లను ఎక్కడ తెస్తారన్నది తెలియరాలేదు.