హైదరాబాద్, జనవరి 1: ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్(టై) హైదరాబాద్ నూతన ప్రెసిడెంట్గా శ్రీని చందుపట్ల నియమితులయ్యారు. ఆయన 25వ ప్రెసిడెంట్ కావడం విశేషం. ప్రాంతీయ సంస్థలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ఉద్దేశంలో భాగంగా ఏర్పాటైన ఈ టై హైదరాబాద్..మెంటరింగ్, నెట్వర్కింగ్, ఫండింగ్, ఇంక్యూబేషన్ సేవలు అందిస్తున్నది. మంజీరా డిజిటల్ సిస్టమ్స్ కో-ఫౌండర్ శ్రీని..స్టార్టప్ టెక్నాలజీ బిజినెస్లో 20 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. అంతర్జాతీయంగా లాభాపేక్ష లేని ఈ ఎంటర్ప్రెన్యూర్ 1992లో సిలికాన్ వ్యాలీ వేదికగా ప్రారంభమైంది. అలాగే పగడాల కన్సట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాజేశ్..టై హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు.