న్యూఢిల్లీ, మార్చి 25: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా శ్రీకాంత్ వెంకటాచారి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1 నుంచి అమలులోకి రానున్నట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. 2005లో సీఎఫ్వోగా నియమితులైన అలోక్ అగర్వాల్ స్థానాన్ని శ్రీకాంత్ భర్తి చేయనున్నారు. అలోక్ అగర్వాల్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ సీనియర్ సలహాదారుడిగా నియమితులయ్యారు.