హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : గ్లోబల్ టెక్-ట్రావెల్ క్లస్టర్గా హైదరాబాద్ను తీర్చి దిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదురొనేలా.. ఈ రంగ దిగ్గజ కంపెనీలను ఆకర్షించేలా ఒక పటిష్టమైన ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామని అమెరికాకు చెందిన ‘సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్’ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు.
విమానయానం, స్పేస్-టెక్, డిఫెన్స్, డీప్-టెక్ తదితర రంగాల్లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతున్నదని వివరించారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేసేలా నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ‘రెడీ టూ వర్ ఫోర్స్’ తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. ఆర్అండ్డీ, సిల్లింగ్, ఇన్నోవేషన్ తదితర అంశాల్లో దిగ్గజ సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామన్నారు.