E-Bike Rental Service | తమిళనాడులోని దక్షిణ రైల్వే అధికారులు తిరుచ్చి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ బైక్ (ఈ-బైక్) రెంటల్ సర్వీసును ప్రారంభించారు. రైల్వే స్టేషన్ వద్ద ఈ-బైక్ సర్వీస్ అందుబాటులోకి వచ్చిందన్న వార్త తెలియగానే దాని గురించి ఎంక్వయిరీలు భారీగా హోరెత్తాయి. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ-బైక్ రెంటల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఇక తిరుచ్చి జిల్లాలో ఇదొక్కటే ఈ-బైక్ రెంటల్ సర్వీస్ కావడం ఆసక్తికర పరిణామం.
ఈ-బైక్ సెంటర్ వద్ద బైక్ తీసుకునే వారు రూ.1000 డిపాజిట్ చేయాలి. గంటకు రూ.50 అద్దె వసూలు చేస్తారు. బైక్ అద్దెకు తీసుకునే వ్యక్తి తన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
దక్షిణ రైల్వేతో ఈ రెంటల్ కంపెనీ అసోసియేట్ అయ్యింది. ప్రస్తుతం గంటల వారీగా, రోజు వారీగా, వారం ప్రాతిపదికన ఈ-బైక్స్ అందజేస్తున్నది. కానీ గంటల సర్వీస్కు ఎక్కువ మంది ఎంక్వయిరీలు చేస్తున్నారు. తిరుచ్చి రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించే గణేశ్ బాబు అనే వ్యక్తి మాట్లాడుతూ ఇది మంచి ఇన్షియేటివ్, కానీ సంబంధిత వ్యక్తి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకూడదన్నారు. ఒకటి, రెండు సార్లు క్యూరియాసిటీతో డ్రైవ్ చేసిన తర్వాత ఈ సర్వీస్ను వదిలేస్తారన్నారు.
కస్టమర్ల నుంచి మనీ తీసుకోవడానికి బదులు రైల్వేలు సదరు ఈ-బైక్ గ్యారంటీ కోసం పత్రాలు తీసుకోవడం బెటర్, బైక్స్కు జీపీఎస్ అనుసంధానిస్తారు. అది ఎక్కడున్నా తెలిసిపోతుంది. సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేయడానికి అర్థమే లేదన్నారు. రైల్వే ప్రయాణికులు కాకున్నా ఈ-బైక్స్ రెంటల్కు తీసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.