New Year Orders | నూతన సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ స్పెషల్గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. స్నేహితులు, బంధువులు ఒక దగ్గర చేరి నృత్యాలు, కేరింతలు కొడుతూ కొత్త వసంతానికి వెల్కం చెబుతారు. న్యూఇయర్ డే సందర్భంగా ఫుడ్కు స్పెషల్ స్థానం ఇస్తారు. తమకు నచ్చిన ఫుడ్ తినడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్లు రావడంతో ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తారు.
అలా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వాసి చేసిన ఆర్డర్ చూసి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఆశ్యర్య చకితులయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 125 రుమాలీ రోటీలను జొమాటోలో ఆర్డర్ చేశాడు కోల్కతా వాసి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ `ఎక్స్ (మాజీ ట్విట్టర్)`లో రియాక్టయ్యారు. తనకూ ఆ పార్టీకి వెళ్లాలన్న కోరిక ఉందని పేర్కొన్నారు. `సింగిల్ ఆర్డర్లోనే 125 రుమాలీ రోటీలు ఆర్డర్ చేశారు. నాకూ నిజంగా ఆ పార్టీకి వెళ్లాలని అనిపిస్తున్నది` అని దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలైంది.