న్యూఢిల్లీ, నవంబర్ 12: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సోమవారం భేటీకానున్నారు. వర్చువల్గా ఈ నెల 15న జరగనున్న ఈ సమావేశంలో.. ఆర్థికాభివృద్ధి కోసం ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. ప్రభుత్వం మూలధన వ్యయాల్ని పెంచుతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలో సానుకూల సెంటిమెంట్ నెలకొందని, అయితే ఈ రంగం పెద్ద ఎత్తున వాస్తవ పెట్టుబడుల్ని పెట్టడం లేదని ఆర్థిక కార్యదర్శి శుక్రవారంనాడిక్కడ మీడియాకు వివరించారు. అధిక ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు.