న్యూఢిల్లీ, జనవరి 19: వెండి పరుగులు పెట్టింది. రూపాయి మరింత బలహీనపడటంతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,600 ఎగబాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో ధర రూ.63,400 పలికింది. వెండితోపాటు పసిడి కూడా స్వల్పంగా పెరిగింది. తులం బంగారం ధర రూ.47,880 పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.130 అధికమై రూ.49,200 పలుకగా, రూ.1,500 ఎగబాకిన కిలో వెండి రూ.67,300కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,841డాలర్లు పలుకగా, వెండి 23.64 డాలర్ల వద్ద నిలిచినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.