హైదరాబాద్, జూలై 28: సిగ్నిటీ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.439 కోట్ల ఆదాయంపై రూ.44.56 కోట్ల లాభా న్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 378 కోట్ల ఆదాయంతో పోలిస్తే 16 శాతం పెరుగగా, రూ.31 కోట్ల లాభంతో పోలిస్తే 44 శాతం ఎగబాకింది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో టాప్ 5 క్లయిం ట్ల వాటా 23 శాతంగా ఉన్నదని, బీఎఫ్ఎస్ఐ, రిటైల్, ఈ-కామర్స్, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ రంగాలు మెజార్టీ వాటాను దక్కించుకున్నాయన్నారు.