న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల బైబ్యాక్కు సెప్టెంబర్ 12 రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ తేదీనాటికి ఎల్ అండ్ టీ షేర్లు ఉన్న వాటాదారులు ఈ బైబ్యాక్లో పాల్గొనేందుకు అర్హులు.
ఒక్కో షేరును రూ. 3,000కు టెండర్ ఆఫర్ మార్గంలో 3,33,33,333 ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసేందుకు జూలై 25న కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బైబ్యాక్ను రెండు క్యాటగిరీలుగా విభజిస్తున్నామని, ఒక క్యాటగిరీలో షేర్లను చిన్న షేర్హోల్డర్లకు రిజర్వ్ చేస్తామని, మరోటి అర్హులైన షేర్హోల్డర్లకు జనరల్ క్యాటగిరీ అని సంస్థ తెలిపింది.