ప్రయాగ్రాజ్, ఏప్రిల్ 26: తాను 50 ఏండ్లు వైద్యుడిగా పనిచేసిన దవాఖానలో ఒక్కటంటే ఒక్క వెంటిలేటర్ దొరక్క యూపీలోని ప్రయాగ్రాజ్లో సీనియర్ వైద్యుడు జేకే మిశ్రా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏండ్లు. ప్రయాగ్రాజ్లో ఉన్న స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) దవాఖానలో 50 ఏండ్లు వైద్య సేవలు అందించారు. ఇటీవల కరోనా సోకడంతో ఈ నెల 16న దవాఖానలో చేరారు. వెంటిలేటర్ అవసరం పడింది. దవాఖానలో ఉన్న అన్ని వెంటిలేటర్లపై అప్పటికే రోగులు చికిత్స పొందుతున్నారు. మిశ్రాకు వెంటిలేటర్ దొరకలేదు. దీంతో తాను 50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో మిశ్రా వెంటిలేటర్ దొరక్క చనిపోయారు.