Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్గా ముగిశాయి. ఇటీవల వరుస సెషన్లలో లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 82,643.73 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటిక మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో 82,680.79 పాయింట్ల గరిష్టాన్ని తాకగా.. అత్యల్పంగా 82,240.40 పాయింట్ల కనిష్టానికి తగ్గింది. చివరకు 53.49 పాయింట్లు పతనమై.. 82,391.72 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 1.05 పాయింట్లు పెరిగి 25,104.25 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,160 షేర్లు పెరిగాయి. మరో 1,723 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ లాభపడగా.. ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి. రియాల్టీ ఇండెక్స్ ఒకశాతం పతనం కాగా.. ఐటీ ఇండెక్స్ 1.7 శాతం పెరిగింది. మీడియా ఇండెక్స్ ఒకశాతం వృద్ధిని నమోదు చేసింది. పవర్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా.. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.