‘దేశీయ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు అధికంగా లాభపడ్డాయి. చైనా వృద్ధిరేటుపై ఆందోళన వ్యక్తంకావడంతోపాటు రష్యా సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సూచీలు పుంజుకోవడం విశేషం’
– శ్రీకాంత్ చౌహాన్, కొటక్ సెక్యూరిటీస్ హెడ్
ముంబై, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగియడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. ఆర్థిక, రియల్టీ, టెక్, ఐటీ రంగ షేర్లు ఇచ్చిన దన్నుతో సెన్సెక్స్ మళ్లీ 63 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 446.03 పాయింట్లు ఎగబాకి 63,416.03లకు చేరుకున్నది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 126.20 పాయింట్లు అందుకొని 18,817.40 వద్ద స్థిరపడింది.