న్యూఢిల్లీ, డిసెంబర్ 19: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ప్రమోటర్లను రూ.4.29 కోట్లు చెల్లించాలని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆదేశించింది. ఈ మేరకు డీసీకి డిమాండ్ నోటీసు జారీ చేసింది. 2008-09 నుంచి 2011-12 మధ్య సంస్థ ఆర్థిక ప్రకటనల్లో అవకతవకలకు సంబంధించి శుక్రవారం సెబీ ఈ నోటీసునిచ్చినట్టు సోమవారం తెలిసింది. డీసీ ప్రమోటర్లు టీ వెంకట్రామిరెడ్డి, టీ వినాయక్ రవిరెడ్డిలతోపాటు పీకే అయ్యర్ ఈ సొమ్మును 15 రోజుల్లోగా చెల్లించాలని సెబీ స్పష్టం చేసింది. ఒకవేళ చెల్లించకపోయినైట్టెతే డీసీ ప్రమోటర్ల స్థిరచరాస్తులను జప్తు చేసి అమ్మి బకాయిలు వసూలు చేసుకుంటామని కూడా హెచ్చరించింది. అప్పటికీ తీరకపోతే జైలుశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది.