న్యూఢిల్లీ : ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణకు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్
(ఎన్ఎస్ఈ) షాకిచ్చింది. ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలకు సంబంధించి దర్యాప్తు జరుగుతుండగా..
సెబీ చర్యలు చేపట్టింది. చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు ఆనంద్ సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఈ బిజినెస్
డెవలప్మెంట్ ఆఫీసర్ రవి వారణాసితో పాటు మొత్తం 18 మంది సంస్థలు, వ్యక్తులకు సెబీ రూ.44 కోట్ల
ఫైన్ విధించింది.
ప్రముఖ డార్క్ ఫైబర్ కేసులో సెబీ చర్యలు తీసుకున్నది. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఎన్ఎస్ఈకి రూ.7 కోట్లు, చిత్రా రామకృష్ణ, వారణాసి, సుబ్రమణ్యం ఆనంద్లకు రూ.5 కోట్ల చొప్పున జరిమానా విధించింది. మిగతా మొత్తాన్ని స్టాక్ బ్రోకర్ కంపెనీలకు ఫైన్ వేసింది. నాగేంద్ర కుమార్ ఎస్ఆర్వీఎస్, దేవి ప్రసాద్ సింగ్లకు రూ.కోటి, వే టు వెల్త్కు రూ.6 కోట్లు, జీకేఎన్ సెక్యూరిటీస్కు రూ.5 కోట్లు, సంపర్క్ ఇన్ఫోటైన్మెంట్కు రూ.3 కోట్లు జరిమానా విధించగా.. 45 రోజుల్లో జరిమానాను చెల్లించాలని ఆదేశించింది.