ముంబై, జూన్ 8: దేశంలో కుటుంబాల పొదుపు, సంపద సష్టికి క్యాపిటల్ మార్కెట్స్ కీలకంగా మారుతున్నాయని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే అన్నారు. భారతీయుల పెట్టుబడుల్లో వస్తున్న నిర్మాణాత్మక మార్పు, దేశ వృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని క్యాపిటల్ మార్కెట్స్ ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ 2026లో పాండే పాల్గొన్నారు.
భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్లలో సుమారు 14.5 కోట్ల మదుపర్లున్నారని పాండే తెలిపారు. ఏటేటా 20 శాతానికిపైగా పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు కూడా రూ.8 లక్షల కోట్లను దాటాయని వివరించారు.
సామాన్య ప్రజానీకం సైతం నేడు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని గుర్తుచేశారు. 2022-23లో దేశ జీడీపీలో దాదాపు 20 శాతంగానే ఉన్న కుటుంబ పొదుపు.. 2024-25లో 21.7 శాతానికి పెరిగిందన్నారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ రెగ్యులేషన్లపై త్వరలోనే కన్సల్టేషన్ పేపర్ వస్తుందని తెలిపారు.