SBI | న్యూఢిల్లీ, జనవరి 8: దేశంలో ఆదాయ అసమానతలు తగ్గాయని, ముఖ్యంగా పన్నులు చెల్లించేవారిలో మూడోవంతు అధిక ఆదాయ పన్ను పరిధిలోకి చేరారని ఎస్బీఐ పరిశోధన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ పన్ను చెల్లించేవారి సంఖ్య తగ్గిపోవడం విశేషమని తన ఎకనమిక్ రీసర్చ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కరోనాతో కుదులైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధి బాట పట్టింది. 2014 నుంచి 2022 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 0.472 శాతం నుంచి 402 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. ఇదే సమయంలో 36.3 శాతం మంది పన్ను చెల్లించేవారు తక్కువ ఆదాయం నుంచి అధిక ఆదాయ పనున బకెట్లోకి చేరారు. వారి ఆదాయం 21.3 శాతం అధికమైంది. విలువ పరంగా చూస్తు చిన్న స్థాయి సంస్థలు ఎంఎస్ఎంఈలుగా మారాయి.