ముంబై, నవంబర్ 2: డిజిటలైజేషన్కు మరింత ఊతమిస్తూ ఎస్బీఐ.. తమ మొబైల్ యాప్ యోనోపై ప్రీ-అప్రూవ్డ్ టూవీలర్ లోన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ‘ఈజీ రైడ్’ లోన్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో బ్యాంక్ స్పష్టం చేసింది. గరిష్ఠంగా రూ.3 లక్షలు, కనిష్ఠంగా రూ.20వేల లోన్ పొందవచ్చు. రుణ కాలపరిమితి నాలుగేండ్లు మించరాదు. వార్షిక వడ్డీరేటు 10.5 శాతం. వాహనం ఆన్-రోడ్ ధరపై 85 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. రూ.లక్షకు సగటు ఈఎంఐ రూ.2,560. రుణ మొత్తం నేరుగా డీలర్ ఖాతాలోనే జమ అవుతుంది. ఇప్పటికే యోనో ద్వారా గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వడ్డీరేటులో 5 బేసిస్ పాయింట్ల రాయితీని ఎస్బీఐ కల్పిస్తున్న విషయం తెలిసిందే.