Special Fixed Diposits | అధిక ధరలను నియంత్రించడానికి గతేడాది మే నుంచి ఆర్బీఐ 250 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచేసింది. తదనుగుణంగా వివిధ బ్యాంకులు రుణాలతోపాటు డిపాజిట్లపైనా వడ్డీరేట్లు సవరించాయి. ప్రత్యేకించి ఖాతాదారుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షించడానికి పలు బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లు అమల్లోకి తెచ్చాయి. ఆయా స్పెషల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు.. వాటిపై లభిస్తున్న వడ్డీరేట్లపై ఓ లుక్కేద్దాం..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ). తన ఖాతాదారుల కోసం రెండు స్పెషల్ టర్మ్ డిపాజిట్ పథకాలు అమలు చేస్తున్నది. వాటిల్లో ఒకటి అమృత్ కలశ్. రెండవది ఎస్బీఐ వుయ్కేర్.
ఎస్బీఐ అమృత్ కలశ్ కింద 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం తెచ్చింది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన సాధారణ ఖాతాదారులకు 7.10 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం ఇంటరెస్ట్ పే చేస్తుంది. ఇక ఎస్బీఐ వుయ్ కేర్ డిపాజిట్ స్కీంలో నగదు జమ చేసిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 30 బేసిక్ పాయింట్లు వడ్డీ పే చేస్తున్నది. ఐదేండ్లు, అంతకు మించి గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ ఇంటరెస్ట్ వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ ఆఫర చేస్తున్నది ఎస్బీఐ.
సీనియర్ సిటిజన్ల కోసం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రత్యేకించి ‘సీనియర సిటిజన్ కేర ఎఫ్డీ’ తెచ్చింది. ఈ పథకం కింద జమ చేసిన సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 25 బేసిక పాయింట్లు వడ్డీ అందిస్తున్నది. ఈ స్కీం కింద పదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ అందుతున్నది.
సీనియర్ సిటిజన్లను ఆకట్టుకునేందుకు ఐడీబీఐ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ‘నమాన సీనియర్ సిటిజన్ డిపాజిట్’ తెచ్చింది. సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అదనంగా 0.25 శాతం వడ్డీ అందిస్తుంది. ఏడాది నుంచి పదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు ఈ స్కీం వర్తిస్తుంది. ఇప్పటికే చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల పునరుద్ధరణకు, కొత్త డిపాజిట్లకు ఈ స్కీం అమలు చేయవచ్చు.
సీనియర్ సిటిజన్లను, సాధారణ ఖాతాదారులకు ఆకర్షించడానికి ఇండియన్ బ్యాంక్.. ఇండ్ శక్తి 555 డేస్ అనే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం తెచ్చింది. ఇందులో సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ పథకం కింద కనీసం రూ.5000, గరిష్టంగా రూ.2 కోట్ల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం గడువు 555 రోజులు.
సీనియర్ సిటిజన్లను ఆకట్టుకునేందుకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రెండు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లు తెచ్చింది.‘పీఎన్బీ ఫ్యాబులస్ 300 డేస్’, ‘పీఎన్బీ ఫ్యాబులస్ 601 డేస్’ అనే పథకాలు తెచ్చింది. వీటితోపాటు ఉత్కర్ష్ 222 డేస్ అనే స్కీం, పీఎన్బీ ఈ-అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం అమలు చేస్తున్నది. 300 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.35 శాతం వడ్డీ అందిస్తున్నది. 601 రోజుల గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ ఆఫర్ చేసింది.