న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ డిజిటల్ సేవలు ఈ నెల 4,5 తేదీల్లో కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. మెయింటెన్స్ వర్క్ చేపట్టినందు వల్ల ఈ సేవలకు అంతరాయం కలుగుతుందని ఎస్బీఐ తెలిపింది. దీని ప్రకారం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఏ సేవలకు అంతరాయం కలుగుతుంది.
శనివారం అర్ధరాత్రి 22:35 గంటల నుంచి ఆదివారం (సెప్టెంబర్ 5) తెల్లవారుజామున 1:34 గంటల వరకు మెయింటెనెన్స్ వర్క్స్ కొనసాగుతాయి. దాదాపు 180 నిమిషాల సేపు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో సేవలకు అంతరాయం కలుగుతుందని ఎస్బీఐ ట్వీట్ చేసింది.