SBI Cards | ఎస్బీఐ ఆధ్వర్యంలోని క్రెడిట్ కార్డుల విభాగం.. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ) జారీ చేయడం ద్వారా రూ.3000 కోట్ల వరకు నిధులు సేకరించాలని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ నిర్ణయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.
ఖర్చులు అధికం కావడంతో వినియోగదారుల్లో క్రెడిట్ కార్డుల స్పెండింగ్ పెరిగింది. దీంతో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్.. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆశ్చర్యకర రీతిలో లాభాలు గడించింది. గతేడాదితో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నికర లాభం 2.7 శాతం పెరిగి రూ.596 కోట్లు పెరిగింది. మరోవైపు గతేడాది క్రెడిట్ కార్డు సర్వీసుల కంపెనీ మొత్తం ఖర్చులు 39.3 శాతం వృద్ధి చెంది రూ.3,117 కోట్లు పుంజుకున్నాయి. వీటిల్లో ఫైనాన్సియల్ కాస్ట్స్ 89.7 శాతం పెరగడమే కారణం.
కరోనా అనంతరం బిజినెస్ల్లో రికవరీ విస్తృత స్థాయిలో పెరిగింది. వినియోగదారుల స్పెండింగ్ కూడా పెరిగింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల ఆస్తుల్లో నాణ్యత పెరిగింది. ఏడాది కాలంగా వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నా ఎస్బీఐ నిధుల ఖర్చు 185 బేసిక్ పాయింట్లు గతేడాదితో పోలిస్తే 6.7 శాతం ఎక్కువైంది. నికర వడ్డీ ఆదాయం 170 బేసిక్ పాయింట్లు (11.5శాతం) తగ్గింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డుల సర్వీసుల నిర్వహణ ద్వారా సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయం 32 శాతం పెరిగి రూ.3762 కోట్లకు చేరుకున్నది.