హైదరాబాద్, జనవరి 10: లాట్ మొబైల్స్..నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ మెగా ఆఫర్లలో భాగంగా ప్రతి స్మార్ట్ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరేటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్వాచ్, స్పార్క్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ను తక్కువ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ అఖిల్ తెలిపారు. అలాగే 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను చెల్లించి 40 అంగుళాల టీవీని కొనుగోలు చేయవచ్చునన్నారు.
అలాగే రూ.8,999కే స్మార్ట్ టీవీ, రూ.16,500కే ల్యాప్టాప్ను అందిస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్ మొబైల్స్పై రూ.10 వేల వరకు క్యాష్బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లపై ఆరు నెలల ఉచిత సర్వీసింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకు అమలులో ఉండనున్నాయి.