న్యూఢిల్లీ, మే 10: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ మంగళవారం దేశీయ మార్కెట్కు సరికొత్త వాషింగ్ మెషీన్లను పరిచయం చేసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో ఎకోబబుల్ శ్రేణిలో పూర్తి ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లను తీసుకొచ్చింది. 7, 8, 9, 12 కేజీల సామర్థ్యం వరకు లభించే ఈ వాషింగ్ మెషీన్ల ప్రారంభ ధర రూ.41,600లుగా ఉన్నది. ఏఐ వాష్, ఎయిర్ వాష్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ సైకిల్ వంటి ఇంటిలిజెంట్ ఫీచర్లతో 40 మోడల్స్ను తెస్తున్నట్టు ఈ సందర్భంగా కంపెనీ తెలియజేసింది.
స్మార్ట్ డివైజ్లతో కనెక్ట్
ఈ వాషింగ్ మెషీన్లను గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, సామ్సంగ్ స్మార్ట్ టీవీలు, ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లతోపాటు అలెక్సా, గూగుల్ హోం వంటి వాయిస్ డివైజ్లతోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా బెస్ట్ వాష్ ఆప్షన్స్ను కస్టమర్లు పొందవచ్చు. నీటి వినియోగం, డిటర్జంట్ల వాడకం, బట్టలు ఉతికే సమయం ఇలా అన్ని విషయాల్లోనూ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని ఈ వాషింగ్ మెషీన్లు అందిస్తాయన్న విశ్వాసాన్ని సంస్థ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు
మూడేండ్ల వారంటీతో వస్తున్న ఈ వాషింగ్ మెషీన్లు.. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లతోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల్లోనూ అందుబాటులో ఉంటాయి. ఇక ‘బిగ్ లాండ్రీ ఆఫర్’లో భాగంగా ఈ వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 25 శాతం వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతున్నది. 8, 9 కేజీల మోడల్స్పై 17.5 శాతం వరకు, 7 కేజీల మోడల్పై 12.5 శాతం వరకు అదనపు క్యాష్బ్యాక్ సౌకర్యం కూడా ఉన్నది. నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు కూడా ఉండగా, రూ.990కే ఈఎంఐ మొదలుకానున్నది.