హైదరాబాద్, జూన్ 14 (బిజినెస్ డెస్క్): ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా హైదరాబాద్లో అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు లభించనున్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఒకటి, ఢిల్లీలో రెండు ఎక్స్క్లూజివ్ స్టోర్లు ఏర్పాటు చేయగా..నగరంలో ఏర్పాటు చేసింది సంస్థకు నాలుగోది కావడం విశేషం.
ఈ సందర్భంగా కంపెనీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అధికారి రాహుల్ సింగ్ మాట్లాడుతూ..ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో 15 ఎక్స్క్లూజివ్ స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, వీటిలో ఇప్పటికే నాలుగింటిని ప్రారంభించినట్టు, మరో 11 త్వరలో స్టార్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంట్లోభాగంగా వచ్చే ఏడాది హైదరాబాద్లోనే మరో ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించే ఆలోచన కూడా ఉందన్నారు.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 56 చిన్న స్థాయి స్టోర్లు కూడా ఉన్నాయన్నారు. 2022లో ఆదాయంలో 30 శాతం వృద్ధి నమోదుకాగా..2023లో 35 శాతం అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఈ స్టోర్ ప్రారంభం సందర్భంగా తొలి వారంలో ఎంపిక చేసిన ఉత్పత్తులపై బహుమతులు కూడా అందిస్తున్నది. అలాగే విద్యార్థులు కొనుగోలు చేసే స్మార్ట్ఫోన్, ట్యాబ్స్, ల్యాప్టాప్, స్మార్ట్వాచెస్లపై 10 శాతం రాయితీ ఇస్తున్న సంస్థ..22.5 శాతం వరకు క్యాష్బ్యాక్ కల్పిస్తున్నది.