న్యూఢిల్లీ : భారత్లో శాంసంగ్ రెండు అందుబాటు ధరలతో కూడిన స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసింది. గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ23 ఆకట్టుకునే ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చాయి. ఆండ్రాయిడ్12 ఆధారిత ఒన్యూఐ 4.1 స్కిన్ అవుటాఫ్ ది బాక్స్, క్వాడ్ రియర్ కెమెరాలు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సర్ స్పెసిఫికేషన్లు ఆకట్టుకుంటాయి.
ఇక 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో రూ 20,000లోపు ధరలో ఈ రెండు స్మార్ట్ఫోన్లు లభిస్తాయి. గెలాక్సీ ఏ12కు కొనసాగింపుగా గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ22కు కొనసాగింపుగా గెలాక్సీ ఏ23ని శాంసంగ్ లాంఛ్ చేసింది.
ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ13 రూ 14,999 నుంచి రూ 17,499 మధ్య బ్లాక్, వైట్, లైట్ బ్లూ, ఆరంజ్ రంగుల్లో లభిస్తుండగా, గెలాక్సీ ఏ 23 రూ 19,499 నుంచి రూ 20,999 మధ్య లైట్ బ్లూ, బ్లాక్, ఆరంజ్ కలర్స్లో లభిస్తుంది. మరోవైపు ఈ రెండు స్మార్ట్ఫోన్లు కస్టమర్లకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనేది ఇంకా శాంసంగ్ వెల్లడించలేదు.