హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది సామ్సంగ్. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 రెండు రకాల్లో లభించనున్న ఈఫోన్లపై ముందస్తు బుకింగ్లు సైతం ఆరంభించింది సంస్థ. ప్రారంభించిన తొలిరోజే 75 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయని కంపెనీ సీనియర్ డైరెక్టర్ ఆదిత్యా బబ్బర్ తెలిపారు.
వీటిలో 8జీబీ/128 జీబీ మెమొరీ కలిగిన జెడ్ ఫ్లిప్ 4 మోడల్ ధరను రూ.89,999 గాను, 8జీబీ/256జీబీ మోడల్ ధర రూ.94,999గా నిర్ణయించింది. అలాగే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మోడల్ రూ.1,54,999 మొదలుకొని రూ.1,84,999 లోపు లభించనున్నది. ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.31,999 విలువైన గెలాక్సీ వాచ్4ని రూ.2,999కి అందిస్తున్నది.